Breaking News

ఆర్మూర్ మహాత్మ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో… శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్…

Cell No: 9440384115

Registration Govt TG No: 122/2025

ఆర్మూర్ మహాత్మ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో

మరోసారి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ…

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్

ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, పేరుకుపోయిన చెత్త చెదారాన్ని, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రపరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వచ్ఛ భారత్ నిర్వహించడం మా అదృష్టమన్నారు. ప్రతి రోజు ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాలను శుభ్రం చేశామన్నారు. ఆలయం చుట్టూ ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు మొత్తం తొలగించామన్నారు. దీనికి ఆలయ కమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందించారన్నారు. మాన చుట్టుపక్కల ఉన్న ప్రతి గుడి, బడి, ప్రభుత్వ కార్యాలయాలలో ఇటువంటి స్వచ్ఛ కార్యక్రమాలు 63 వారాలుగా నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు. ఇకముందు కూడా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గడ్డం సంజీవ్ రెడ్డి, ఆలయ అర్చకులు చిలుకమర్రి ఆనంద్ బాబు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, జంగిడి బోజన్న, సుమన్, కుకింగ్ నరేష్, కృషివర్ధన్, బోడమీది ప్రశాంత్, గుర్రం రాకేష్, ఈనాడు వినోద్ కుమార్, రాహుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *