జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిఎం&హెచ్ఓ
అనంతపురం విజయభారతి
అనంతపురం జిల్లా నూతన వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు సోమవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ ను వారి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన డిఎం&హెచ్ఓ కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని సూచించారు. వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఆరోగ్య రంగంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలబెట్టాలని ఆకాంక్షించారు.
అనంతరం, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ను కూడా నూతన డిఎం&హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తన వంతు పూర్తి కృషి చేస్తానని ఈ సందర్భంగా డిఎం&హెచ్ఓ అన్నారు.

