
విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 22
తులం బంగారం ఇవ్వకపోతే.. కాంగ్రెస్ నేతల మెడలోంచి తీసుకోండి: రాకేష్ రెడ్డి
తెలంగాణ : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఇవ్వకపోతే ఆ పార్టీ నాయకుల మెడలోంచి తీసుకోవాలని ప్రజలకు సూచించారు. పోలీసులు కేసు పెడితే తనవద్దకు రావాలన్నారు. ప్రభుత్వం ఇల్లు కట్టి ఇవ్వకపోతే, తన సొంత ఖర్చులతో ఇల్లు కట్టించి ఇస్తానన్న హామీ మేరకు ఇప్పటివరకు 3 వేల ఇళ్లను కేంద్రం వాటాతో కట్టించానన్నారు.
