
(విజయభారతి న్యూస్) హైదరాబాద్ జూలై 22
కరోనా కట్టడికి ప్రభుత్వం ముందస్తు చర్యలు
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో కొత్తగా ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 145 మందికి పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 26 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, గత అనుభవాల దృష్ట్యా దశల వారీగా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. కరోనా కట్టడికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది.
