Breaking News

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై సబ్ కలెక్టర్ సమీక్ష….

(విజయభారతి) : ఆర్మూర్ న్యూస్; జూలై 28

పార్క్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మానం

ఆర్మూర్ పట్టణ ప్రాంతంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి సబ్ కలెక్టర్ బీఎల్‌ఓలతో సమీక్ష సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిధి, ఓటర్ల సౌకర్యాలు, కేంద్రాల నిర్వహణకుసంబంధించినఅంశాలపైఅధికారులతో చర్చించారు.
అనంతరం సబ్ కలెక్టర్ మున్సిపల్ సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
బీఎల్‌ఓలు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించిన వివరాలను సమగ్రంగా పరిశీలించి, అవసరమైన ఫారాలను త్వరితగతిన పూర్తి చేసి సమర్పించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సబ్ కలెక్టర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *