నిద్రమత్తులో జోగుతున్న ఉన్నతాధికారులు
మామూళ్ల కు పరిమితమైన టౌన్ ప్లానింగ్ విభాగం
నిర్మాణ అనుమతులు రద్దు చేసిన రిఓకేషన్ నెంబర్ E/403006 ఆగని అక్రమ నిర్మాణం
చట్టాలు చుట్టాలుగా మార్చుకొని అక్రమ నిర్మాణాల జోరు
మనీ మెక్స్ మెనీ థింగ్స్
బేరం కుదుర్చుకొని అక్రమార్కుల వద్ద లక్షల్లో వసూలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు కిందిస్థాయి సిబ్బంది
మియాపూర్ మదినాగుడా విజయ భారతి న్యూస్ ;
ఎట్టి పరిస్థిథుల్లొను అక్రమ నిర్మాణాలను ఉపెక్షించమని చెప్పే అధికారులు అంధిన కాడికి దండుకొని ఏమి ఎరుగనట్లు చోద్యo చూస్తున్నారు. మదీనాగుడా డివిజన్ పరిధిలోని మంజీరా పైప్ లైన్ రోడ్ లో సర్వే నంబర్ 23 పార్కు స్థలాన్ని కొంతమంది భూ బకాసురులు సర్వే నంబర్ 5,6,7,8, గా మార్చి అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణం వెంటనే నిలిపివేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. మదినాగుడా డివిజన్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల పై ప్రజల నుండి పిర్యాదులు అంధుథున్నా చూస్తాం చర్యలు తీసుకుంటామని చెప్తూ జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్రమత్తులో ఉండి కాలయాపన చేస్తున్నారు. చైన్ మెయిన్ ల ద్వార, మధ్యవర్తుల ద్వార వ్యవహారం చక్కబెట్టుకుంటున్నారు. వారికి చైన్ మెన్ లు మధ్యవర్తులు అన్ని తామై వ్యవహారిస్థున్నారు. మియపూర్ సర్కిల్ పరిధి లొ టౌన్ ప్లానింగ్ అధికారులపై , చైన్ మేన్ ల పై ఎన్ని ఆరోపణలు, కధనాలు వచ్చినప్పటికీ చైన్ మెన్ లను అటు ఇటు మార్చినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు.
నిబంధనలకు నీళ్లు…
మదినాగుడా డివిజన్ పరిధిలోని మంజీరా పైపులైన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పార్కు స్థలాన్ని కొంతమంది భూ బకాసురులు సర్వేనెంబర్ 23ను కాస్త సర్వే నంబర్ 5,6,7,8 గా మార్చి
నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేస్తున్నారు. దీని పై వెంటనె జి హెచ్ యం సి అధికారులు కాలయాపన చేయకుండా కబ్జాలకు పాల్పడ్డ వారిపై వెంటనే కటిన చర్యలు తీసుకోని పార్కు స్థలాన్ని కాపాడాలని అక్కడి గ్రామస్థులు కోరుతున్నారు.
భవన నిర్మాణ అనుమతులను రద్దు చేసిన (రిఓకేషన్ నెంబర్ E/403006) కోట్లు విలువ చేసే ఆ కమర్షియల్ స్థలంలో బిల్డర్ అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నాడు.
చట్టాలను చుట్టాలుగా చేసుకుంటూ మదినాగుడా డివిజన్ సర్వే నంబర్ 23 పార్కు స్థలంలో ఓ బడా బిల్డర్ అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన సదరు బిల్డర్ మరో అడుగు ముందుకేసి ఏకంగా పార్కు కబ్జా చేసి ఆ స్థలంలో అక్రమాంతస్తుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు చర్యలు తీసుకోవాల్సిన జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు వెనుకడుగు వేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
మనీ మేక్స్ మెనీ థింగ్స్.. అనేది అక్షరాలా నిజం డబ్బు ఏదైనా చేస్తుంది. ఎంతటి అరాచికాన్నైనా ఈజీగా చేసేస్తుంది.. నీతి ఉండదు.. నిజాయితీ ఉండదు.. నిబంధనలుండవు.. అందరినీ ఆవహిస్తుంది.. బాధ్యతలు మరచిపోయేలా చేస్తుంది.. ప్రస్తుతం మియాపూర్ సర్కిల్ 48 లో ఇదే జరుగుతోంది. ఎక్కడచూసినా అక్రమ నిర్మాణాలు, అవినీతి రాజ్యం ఏలుతోంది.. ప్రభుత్వ అధికారులు లంచాల మత్తులో జోగుతూ తమ విధులను మరచిపోతుండటంతో ఆగడాలు ఆగడం లేదు.. జీ.హెచ్.ఎం.సి. మియాపూర్ సర్కిల్ లో యథేచ్ఛగా జరుగుతున్న బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణం వ్యవహారంలో ఇలాంటి జోక్యం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
అన్ని ఆధారాలతో నిరూపిస్తాం మియాపూర్ సర్కిల్ జిహెచ్ఎంసి పరిధిలో చెలరేగుతున్న పార్కుల కబ్జా అక్రమ నిర్మాణాదారులు.. ప్రేక్షక పాత్రలో టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వా నిబంధనలకు తెలిదాకాలు యదేచ్చగా పార్కుల కబ్జాలపై ప్రజా శ్రేయస్సు దృశ్య పూర్తి ఆధారాలతో విజయభారతి దినపత్రికలు మరో కథనం పాఠకులకు బహిర్గతం చేస్తాం.

