
విజయభారతి : నిజామాబాద్ న్యూస్ జులై 29 రిపోర్టర్ సుంకరి గంగా మహన్
కేంద్ర ప్రభుత్వం పేద బలహీన వర్గాలు ఇబ్బందులు పడకుండా గతంలో అత్యధిక వర్షాలు, తీవ్ర వేసవి పరిస్థితుల దృష్ట్యా మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసింది.ఒక్కొక్కరికి 18 కిలోలు చొప్పున మూడు నెలల బియ్యం పంపిణీతాజాగా ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు సంబంధించి రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టింది. వేసవికాలంలో ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేశారు జూలై నుంచి నెలవారి రేషన్ పంపిణీ ప్రారంభించారు. కరువు పరిస్థితులు నెలకొన్న క్రమంలో మరోసారి మూడు నెలల రేషన్ ఇవ్వడం ద్వారా లబ్ధిదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. బియ్యం పంపిణీ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పౌరసరఫరాల శాఖ సన్నద్ధమైంది. రేషన్ డీలర్లకు బియ్యం పంపిణీ ప్రారంభించారు. మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం వల్ల రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి రేషన్ బియ్యం అందించడం వల్ల పంపిణీ చేయడంలో శ్రమ అధికమవుతుందని వాపోతున్నారు. నిలువ సామర్థ్యం లేని దుకాణాల్లో డీలర్లు బియ్యం కోటాను భద్రపరచడం కష్టంగా మారుతుందని చెబుతున్నారు. దీనికి తోడు తూకంలో తరుగు వస్తుందని, నెట్వర్క్ సమస్యలు ఈ-పాస్ యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడం, ఒక్కో లబ్ధిదారుడు 15 నుంచి 20 నిమిషాల సమయం వేలిముద్రల సరిపోతుందని డీలర్లు చెబుతున్నారు.
