Breaking News

ఆర్మూర్ అభివృద్ధికి కేంద్ర నిధులే లక్ష్యం…. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి….

డొంకేశ్వర్ మండల అభివృద్ధికి కృషి చేస్తా…. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి….

(విజయభారతి ): ఆర్మూర్ న్యూస్: జులై 30: రిపోర్టర్ సుంకరి గంగా మోహన్


న్యూఢిల్లీ: ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన కేంద్ర ప్రభుత్వ నిధుల మంజూరు కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఢిల్లీలో మూడు రోజుల పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.నియోజకవర్గంలోని రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సీఆర్‌ఐఎఫ్ (CRIF) నిధులను మంజూరు చేయడంతో పాటు ఇతర కీలక అభివృద్ధి పనులకు అవసరమైన కేంద్ర నిధుల విడుదలకు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన మంత్రిని కోరారు.ఆర్మూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని నిధులు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఢిల్లీలోని తన మూడు రోజుల పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆర్మూర్ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలు, ప్రాజెక్టులపై చర్చించి, అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *