సద్భావన అవార్డు కార్యక్రమానికి బండి రమేష్ ని ఆహ్వానించిన కొప్పిశెట్టి రఘు
కూకట్ పల్లి విజయ భారతి న్యూస్ ;
ఈ నెల 19 న జరగనున్న సద్భావన అవార్డు కార్యక్రమానికి రావాలని కాంగ్రెస్ నాయకుడు కొప్పిశెట్టి రఘు బాలానగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూకట్ పల్లి ఇంచార్జ్ బండి రమేష్ ని బుధవారం రోజు కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి గీతారెడ్డికి సద్భావన అవార్డు బహుకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అరుణ్, అయాజ్, అశోక్, మహిళా డివిజన్ అధ్యక్షురాలు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

