
విజయభారతి ఆర్మూర్ న్యూస్ :
పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవ్యా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి పాఠ్యాభ్యాసం, పాఠశాల వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్ సబ్ కలెక్టర్ను శాలువాతోసన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో సత్యనారాయణ, బీఎల్వోలు,ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
