Breaking News

ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్ గుంత

మ్యాన్ హోల్ సమస్యను పరిష్కరించిన తెలంగాణ జాగృతి నాయకురాలు కొల్లూరు భారతి కుమార్

మియాపూర్ సర్కిల్ విజయభారతి న్యూస్ ;
మదినాగుడా డివిజన్ పరిధిలోని మదినాగుడా ద్వారకా నగర్ వీకర్ సెక్షన్ కాలనీలో నడిరోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ పైకప్పు లోపలికి కూరుకుపోయి గజంలోతు గుంత ఏర్పడింది. నిత్యం వందలాదిమంది కాలనీవాసులు వాహనదారులు ఈ దారిలో ప్రయాణిస్తుంటారు. చిన్న పిల్లలు కూడా ఇదే దారి గుండానే స్కూలుకు వెళుతుంటారు. మదినాగుడా కాలనీవాసులు మ్యాన్ హోల్ సమస్యను కొల్లూరు భారతి కుమార్ కురుమ దృష్టికి తీసుకు రాగానే సంబంధిత అధికారులతో చర్చించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకుని డ్రైనేజీ మ్యాన్ హోల్ సమస్యను సంబంధిత అధికారులతో కలిసి పరిష్కరింప చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకురాలు కల్లూరు భారతి కుమార్ కురుమ, మదినాగుడా ద్వారకా నగర్ వీకర్ సెక్షన్ కాలనీవాసులు, హెచ్ ఎం డబ్ల్యు ఎస్ వర్కర్లు పాల్గొన్నారు.

అమరవీరుల త్యాగాలకు అవమానం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *