ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంటు తీగలు
వ్యవసాయ పొలాల్లో ప్రమాదకరంగా మారిన కరెంటు తీగలు రైతులుఆందోళన.
నిజామాబాద్ జిల్లా ముక్కల్ మండలం పరిధిలోని రెంజర్ల గ్రామంలో వ్యవసాయ పంట పొలాల మధ్యగా వెళ్లే విద్యుత్ తీగలను నిర్లక్ష్యంగా వదిలేయటం వలన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంటలకు నీరు పెట్టే సమయంలో ఎప్పుడైనా కరెంట్ షాక్కు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికంగా విధుల్లో ఉన్న లైన్మెన్ సమస్యను పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందని పంట పొలాల్లో నీటి పంపింగ్ సమయంలో తడిగా ఉండే పరిస్థితుల్లో విద్యుత్ వైర్లు ప్రమాదానికి కారణమవుతున్నాయని రైతులు అంటున్నారు.
ఈ సమస్యను వెంటనే గుర్తించి సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, తక్షణ చర్యలు తీసుకుని వైర్లను సురక్షితంగా సరిచేయాలని గ్రామ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎటువంటి అపశృతి జరగకముందే చర్యలు తీసుకోవాలని వాటి మరమ్మతులు చేయాలని ఇక్కడి రైతులు గ్రామ ప్రజలు అంటున్నారు.

