Breaking News

చిట్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

విజయభారతి : హైదరాబాద్ న్యూస్, జూలై 5

చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడేళ్ల బాలుడు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఆర్మూర్‌ లో మాటల యుద్ధం అభివృద్ధిపై ప్రజల ప్రశ్నలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *