9 డైరెక్టర్ పదవులకు 17 నామినేషన్లు..
నేడు నామినేషన్ల పరిశీలన, రేపు నామినేషన్ల ఉపసహరణ..

విజయభారతి : ఆర్మూర్ న్యూస్
ఆర్మూర్ పట్టణం గోల్డ్ బంగ్లా వద్దగల పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికలలో 17 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారి సాయి కుమార్ గౌడ్ తెలిపారు. గురు, శుక్రవారాలలో ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. చివరి రోజు శనివారం 17 మంది చేనేత కార్మికులు నామినేషన్లు దాఖలు చేశారు. పోహార్ శైలేష్, పోహార్ రాజ్ కరణ్, కర్తన్ గణేశ్యామ్, పడాల్ గణేష్, బాదం రాజ్ కుమార్, షికారి శ్రీనివాస్, ఖాందేశ్ సత్యనారాయణ, కర్తన్ దినేష్, బొచ్ కర్ లక్ష్మీనారాయణ, పడాల్ నరేందర్, పోహార్ విటోబా శేఖర్, బచ్చేవాల్ రెడ్డి శ్రీనివాస్, సాత్ పుతే సంతోష్, సుఖేష్ వర్మ, కర్తన్ గంగా మోహన్, ఖోడె స్వామి, బొచ్ కర్ కోలు గంగామోహన్ లు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.750 రుసుము చెల్లించి ప్రతిపాదకులతో కలిసి నామినేషన్లు అందజేశారన్నారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన జరుగుతుందన్నారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
ఉంటుందన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్నికల చిహ్నాలు కేటాయిస్తామన్నారు. ఈనెల 10వ తేదీన పోలింగ్ ఉంటుందని, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు నిర్వహించి ఎన్నికైన వారితో చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శుల ఎన్నిక నిర్వహిస్తామన్నారు.
