Breaking News

విద్యార్థికి లయన్స్ క్లబ్ చేయూత

20 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించిన ఓఫ్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్

శేరిలింగంపల్లి చందానగర్ విజయభారతి న్యూస్ ; విద్యాలో రాణిస్తున్న 7 వ తరగతి చిన్నారుడు సాయికృష్ణ కి లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్ చేయూతను అందించింది. ఫీజ్ కట్టలేక స్కూల్ వెళ్ళలేకపోయిన బాలుడి విషయం స్థానికంగా లయన్స్ క్లబ్ దృష్టికి రావడం తో లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ బృందం సాయి కృష్ణ కు రూ 20 వేల చెక్కును అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమములో క్లబ్ అధ్యక్షుడు బసి రెడ్డి మధుసూదన్ రెడ్డి, ట్రెజరర్ ప్రవీణ్ రెడ్డి, బర్ల మల్లేష్ యాదవ్, గుర్రం భాస్కర్ , రవీందర్, విష్ణు, భగవాన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్ గుంత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *