Breaking News

ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్…

తెలంగాణలోని ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బి,ఆర్,ఎస్ ప్రకటించింది. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా కవిత పార్టీ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏకంగా హరీశ్ రావుపైనే అవినీతి ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో హరీశ్, సంతోశ్ రావులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ లేక ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.

అక్రమ షెడ్ల నిర్మాణాలపైన అధికారుల మౌనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *