ఆర్టీసీ డిఎంకు వినతి పత్రం…
విజయభారతి(ఏర్గట్ల మండలం)
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్, గుమ్మిర్యాల్ గ్రామాలకు నైటహల్ట్ బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బందికి గురవుతుండడం ఆరోగ్యానికి మరియు చదువుకున్న విద్యార్థులకు నిత్యవసరాలకు వెళ్లి వచ్చేవారికి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతుండడంతో ఆర్మూర్ నుండి బట్టా పూర్ గ్రామానికి నైటహల్ట్ బస్సుతో పాటు గుమ్మిర్యాల్ నుండి హైదరాబాద్ కు వెళ్లే నైటహల్ట్ బస్సును మల్లి అందుబాటులోకి తీసుకురావాలని ఆర్మూర్ బస్ డిపో మేనేజర్ డి,ఎం,గారిని ఈ రోజు కలిసి వినతి పత్రం అందజేసి విజ్ఞప్తి చేయడం జరిగిందని డి,ఎం సానుకూలంగా స్పందించి 15 రోజుల్లో బస్సులను ప్రజలకు, ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం ఉప సర్పంచ్ దయానంద్ పాల్గొన్నారు.
