
విజయభారతి: ఆర్మూర్ :న్యూస్
బాల్కొండ/ఆర్మూర్: తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జిగా ఆర్మూర్ మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య నియమితులైన సందర్భంగా బాల్కొండ, ఆర్మూర్ ప్రాంతాల ఉద్యమకారులు ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారుల ప్రతినిధిగా పస్క నర్సయ్య క్రియాశీలకంగా పనిచేసి ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లారని పలువురు ఉద్యమకారులు పేర్కొన్నారు. ఉద్యమానికి ఆయన అందించిన సేవలను గుర్తించి సంఘం జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం ఆనందదాయకమని తెలిపారు.ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ, ఉద్యమకారుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం కోసం సంఘం ద్వారా మరింత కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘం నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మోహన్, సత్యం, గంగాధర్, నాగరాజ్ చరణ్, రాజేష్, కరీం, బాలు, రాకేష్ తదితరులు పాల్గొని పస్క నర్సయ్యను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.
