Breaking News

పంట పొలంలో విషాదం.. విద్యుత్ ఘాతంతో కోటార్మూర్‌కు చెందిన

పన్నీరు శ్రీనివాస్ విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి…

విజయభారతి :ఆర్మూర్, జూలై 5:

పెర్కిట్‌లో కరెంట్ షాక్‌తో బోర్ మెకానిక్ పన్నీరు శ్రీనివాస్ మృతి

ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్‌కు అన్నపూర్ణ కాలనీకి చెందిన పన్నీరు శ్రీనివాస్ విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన విషాద ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
సమాచారం మేరకు, పన్నీరు శ్రీనివాస్ తన పంట పొలంలో నీటి మోటారును మరమ్మతు చేసేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ విషాద ఘటనతో కోటార్మూర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ పలువురు సభ్యులు, శోకసంద్రంలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *