Breaking News

నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు జగన్నాథ రథయాత్ర ఆహ్వానం అందజేత.

విజయభారతి ; నిజామాబాద్ న్యూస్ జులై 11 సుంకరి గంగా మోహన్ రిపోర్టర్

గానకోకిల ఎస్. జానకి కన్నుమూత…

ఇస్కాన్ కంఠేశ్వర్ వారి ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన నగరంలో నిర్వహించనున్న శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ ఆహ్వానాన్ని నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి ఇస్కాన్ బృందము అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మరియు భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని అందులో భాగంగా నిర్వహిస్తున్న ఈ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవంతుడి కృపకు పాత్రులు కాగలరని కోరారు.ఈ కార్యక్రమంలో మాదాసు స్వామి యాదవ్, నితాయ్ చంద్ ప్రభు, సుమంత్ ప్రభు, సూర్య ప్రభు, రోహిత్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *