Breaking News

తీవ్ర గాయాల పాలైన కార్మికుడు…

గాగిలాపూర్‌లో షెడ్డుపై నుండి పడి కార్మికుడికి తీవ్ర గాయాలు

విజయభారతి/కుత్బుల్లాపూర్ :

మచర్ల జడ్పీహెచ్ఎస్‌కు 25 డ్యూయల్ డెస్క్ బెంచీల విరాళం…

నూతనంగా నిర్మిస్తున్న కమర్షియల్ షెడ్డుపై ఫాబ్రికేషన్ పనులు చేస్తూ కింద పడి ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లంకా భాస్కర్ రావు (43) సూరారంలో నివసిస్తూ కూలి పనులు చేసుకుంటున్నాడు. గురువారం గాగిలాపూర్ చర్చి సమీపంలో షెడ్డుపై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప్రస్తుతం బాధితుడు చింతల్‌లోని ప్రాణధార ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితుడి భార్య ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు దుండిగల్ సిఐ పి.సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *