
విజయభారతి : హైదరాబాద్ న్యూస్ జూలై 11
భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు ఏర్పడింది. ప్రముఖ నేపథ్య గాయని, గానకోకిల ఎస్. జానకి కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆమె మైసూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించిన ఎస్. జానకి తన మధుర గానంతో కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆమె మరణవార్త సినీ పరిశ్రమతో పాటు సంగీత ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
