
విజయభారతి : నిజామాబాద్ న్యూస్: జూలై 13
అక్టోబర్లో పీఎం కిసాన్ 24వ విడత!.. ఈకేవైసీ తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల 23వ విడత పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే, సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు ఇంకా డబ్బులు అందలేదు. ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని, పీఎం కిసాన్ పోర్టల్లో ఈకేవైసీ పూర్తి చేయడం, బ్యాంక్ రికార్డులు సరిదిద్దుకోవడం వంటివి చేయాలని కేంద్రం సూచించింది. 24వ విడత నిధులు అక్టోబర్లో జమ కానున్నాయని తెలుస్తోంది. ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేలు మూడు విడతలుగా అందిస్తున్నారు. నగదు పొందాలంటే ఈకేవైసీ, ఎన్పీసీఐ మ్యాపింగ్, ఆధార్-బ్యాంక్ అకౌంట్ లింక్ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది.
