Breaking News

నేడు విద్యార్థులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ విద్యార్థులకు పంపిణీ..

విజయభారతి నిజామాబాద్ న్యూస్ Jul 13, 2026,

తాళ్లరాంపూర్ సర్పంచ్ పావని కుటుంబానికి ఆర్మూర్ మండల సర్పంచ్‌ల అండరూ… -50 వేల ఆర్థిక సహాయం అందజేత.. -బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన ప్రజాప్రతినిధులు…

నేడు విద్యార్థులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ పంపిణీ
తెలంగాణ : పిల్లల్లో నులిపురుగుల వ్యాప్తిని అరికట్టేందుకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జులై 13న రాష్ట్రవ్యాప్తంగా ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల సుమారు 96.81 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీలు, జూనియర్‌ కళాశాలల్లో ఉచితంగా మాత్రలు అందించనున్నారు. నులిపురుగుల వల్ల వచ్చే రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. 1-2 ఏళ్ల పిల్లలకు అర మాత్ర, 2 ఏళ్ల పైబడిన వారికి 400 ఎంజీ మాత్ర ఇవ్వాలని సూచించారు. ఖాళీ కడుపుతో కాకుండా భోజనం తర్వాతే తీసుకోవాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *