
విజయభారతి : నిజామాబాద్ న్యూస్ Jul 13, 2026,
విద్యార్థులకు అలర్ట్.. రేపు కాలేజీల బంద్?
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై ఏబీవీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జులై 14న కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులు ఉన్నత విద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బకాయిలు చెల్లించేవరకు సర్టిఫికెట్లు ఇవ్వబోమని కొన్ని కళాశాలలు చెబుతున్నాయని ఏబీవీపీ ఆరోపించింది. పెండింగ్లో ఉన్న రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
