విజయభారతి: ఆర్మూర్ న్యూస్
తెలంగాణ : రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
