
విజయభారతి: ఆర్మూర్ న్యూస్: జూలై 6 గంగా మోహన్
అర్మూర్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సూరజ్ కుమారుడు, అల్లుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే సోమవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడి బాధితుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నూతల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ� నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
