
విజయభారతి : హైదరాబాద్ న్యూస్ రిపోర్టర్ సుంకరి గంగా మోహన్
రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు.. అధిష్టానం హెచ్చరిక!
తెలంగాణ : రాష్ట్ర బీజేపీ రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. పార్టీలోనే ఒకరికి ఒకరు శత్రువులుగా ఉన్నారని, ఈ సమస్యను అధిగమిస్తే అధికారంలోకి రావడం ఖాయమని ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్ పాటిల్ వ్యాఖ్యానించారు. గ్రూపులుగా విడిపోవడం, పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్తో పోల్చుతూ, అక్కడ కార్యకర్తలు ఎదుర్కొన్న అణచివేతను ప్రస్తావించి, అలాంటి నిబద్ధత, కసి రాష్ట్ర పార్టీలో ఎందుకు లేదని ప్రశ్నించినట్లు సమాచారం.
