Breaking News

శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని వేడుకలు

విజయభారతి : ఆలూరు న్యూస్

ఆలూర్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను కల్లెడి సర్పంచ్ ప్రణయ్ తేజ్, ఆలూర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అరుణ్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, దేశ సమైక్యత, జాతీయ సమగ్రత కోసం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ప్రణయ్ తేజ్, డాక్టర్ అరుణ మాట్లాడుతూ, దేశ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతగా శ్యాంప్రసాద్ ముఖర్జీ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన ఆశయాలు, దేశభక్తి, సేవా భావం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలూర్ మండల బీజేపీ నాయకులు మల్లయ్య, సుభాష్ తదితరులు పాలుగోన్నారు.

అంక్సాపూర్ జడ్పీహెచ్ఎస్‌లో సోషల్ ఆడిట్అన్ని…….. రంగాల్లో పాఠశాల ముందంజలో ఉందని ప్రశంసించిన సీఈఎస్‌ఎస్ ఫ్యాకల్టీ గుండె అఖిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *