
విజయభారతి : ఆలూరు న్యూస్
ఆలూర్ మండలం కేంద్రం లో 41 గురికి సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రోజున బీజేపీ ఆలూర్ మండల అధ్యక్షుడు సుర శ్రీకాంత్, మండల ఉపాధ్యక్షులు డాక్టర్ అరుణ అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆలూర్ గ్రామంలో ప్రజలు ఎవరైనా అనారోగ్య రీత్యా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చులను సీఎంఆర్ ద్వారా ఇప్పిస్తానని తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి అనారోగ్యంతో ఉంటే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఎల్ఓసి ఇప్పించి వైద్య సేవలు అందేలా చూస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ మండల అధ్యక్షులు సుర శ్రీకాంత్, మండల ఉపాధ్యక్షులు డాక్టర్ అరుణ్ , ప్రధాన కార్యదర్శి హరీష్, మోర్చా జిల్లా నాయకులు సుభాష్, ఓబీసీ మోర్చఅధ్యక్షులు నడిశారం మల్లయ్య, తొర్లికొండ సాయన్న, బూత్ అధ్యక్షులు సురేష్ గౌడ్ బీజేపీ నాయకులు పాలుగోన్నారు.
