Breaking News

పాసు పుస్తకాలు లేని రైతుల పరిస్థితి ఏంటి…

పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకు యూరియా కష్టాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్ ద్వారా అందిస్తున్న యూరియాను పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకు యూరియా కష్టాలు ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదైన వివరాలున్న రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాగీర్దారీ, సీలింగ్, పోడు, దేవుడి మాన్యం భూములు సాగుచేస్తున్న వారికి కొత్త యాప్ ద్వారా యూరియా తీసుకోవడం కష్టమవుతోంది. ధరణి సమస్యలు, రెవెన్యూ సిబ్బంది తప్పిదాలు, వారసత్వ వివాదాలు, ఆన్‌లైన్ లోపాల వల్ల చాలామందికి పాస్ పుస్తకాలు లేవు. వ్యవసాయ అధికారులు నాన్ డిజిటల్ సిగ్నేచర్ (ఎన్‌‌డీఎస్) ఆప్షన్ ఉందని చెబుతున్నా, దానిపై అవగాహన లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇకనైనా మా రైతుల కష్టాలు తీర్చాలని ప్రభుత్వాం తక్షణమే యూరియాను అందించాలని రైతులు అంటున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పనులకు బిల్లుల కు బ్రేక్…. ఆర్మూర్ లో నిలిచిన నిర్మాణాల … వెంటనే నిధులు విడుదల చేయాలి …. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *