ఓటు అమూల్యమైనది మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి
దుండిగల్ సర్కిల్ పరిధిలోని భౌరంపేట్ గ్రామ వార్డు కార్యాలయంలో జరుగుతున్న ‘సర్’ కార్యక్రమాన్ని గురువారం బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్ఓలను కలిసి, ఫారాల పంపిణీ మరియు నమోదు ప్రక్రియ తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా తన ‘సర్’ ఫారాన్ని పూర్తి చేసి బీఎల్ఓకు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి అర్హత కలిగిన ఓటరుకూ ‘సర్’ ఫారాలు అందేలా చూడాలని అధికారులను కోరారు. అవగాహన లేని ఓటర్లకు బీఎల్ఓలు ప్రత్యేక చొరవ తీసుకుని సహాయం చేయాలని, లేనిపక్షంలో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ అమూల్యమైనదని, బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు.

