
విజయభారతి : ఆలూరు న్యూస్
ఆలూర్ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను ఆలూర్ సర్పంచ్ ముక్కెర విజయ్, గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ ఉదయ్, కాంగ్రెస్ నాయకుడు నిలగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, ఆయన ప్రజా సంక్షేమ పాలనను, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ ముక్కెర విజయ్ మాట్లాడుతూ, వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసిన వైఎస్సార్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ మల్లారెడ్డి, నిలగిరి శ్రీనివాస్, బార్ల ముత్యం, భాస్కర్, పెండ ఉదయ్, శశి,కిషన్, గంగారెడ్డి,నారాయణ, చిరంజీవి, చంటి,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
