Breaking News

వైయస్సార్ కు 77వ ఘన నివాళులు…

వైఎస్సార్ 77వ ఘన నివాళులు…

నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలం కేంద్రం లో బుధవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం వైఎస్సార్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజా సంక్షేమ పాలనకు ఆయన ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.
ఆరోగ్య శ్రీ 108లాంటి కార్యక్రమాల తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తనదైన మార్క్ వేసుకుని ఇప్పటికి అవి కొనసాగుతు పేదలకు ఉచితం గా ఖరీదైనా వైద్యం అందుతుందంటే అది ఆయన ఆలోచన నే అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీజీఎస్ ఆర్టీసీ 1,500 కండక్టర్ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *