
విజయభారతి :హైదరాబాద్: న్యూస్ ( జూలై 8)
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ , విద్యార్థులు నిర్వహించిన ఓజస్ 2K 26 ప్రారంభ వేడుకు లు నిర్వహించారు.ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థి సంఘ అధ్యక్షులు డా. తుల రాజేందర్ కుమార్ హాజరు అయ్యారు.
ఈ తరం విద్యార్థిని విద్యార్థులు ఆధునిక టెక్నాలజీ ని సద్వినియోగం చేసుకొని తమ సత్తా చాటాలని, తద్వారా సమాజాభి వృద్ధి కి కృషి చేయాలని సూచించారు. ఉస్మానియా ఘన చరిత్రకి వారసులు గా ఉన్న మీరు అన్ని రంగాల్లో రాణిస్తూ దీన్ని ముందుకు తీసుకు వెళ్తు,సమున్నతంగా నిలబెట్టాలని ఉద్భోదించారు. మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల ప్రతిభ ప్రదర్శించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుల రాజేందర్ తో పాటు పూర్వ విద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
