
విజయభారతి : ఆలూరు న్యూస్
ఆలూర్ మండలం దేగాం గ్రామం లో 4 గురికి సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారి యాదగిరి అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బండారి యాదగిరి మాట్లాడుతూ దేగాం గ్రామంలో ప్రజలు ఎవరైనా అనారోగ్య రీత్యా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చులను సీఎంఆర్ ద్వారా ఇప్పిస్తానని తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి అనారోగ్యంతో ఉంటే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఎల్ఓసి ఇప్పించి వైద్య సేవలు అందేలా చూస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఈరోజు దేగామ గ్రామం లో ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి అన్న గారు సహకారంతో గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పెంచడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలూరు మండల్ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు మేకల శివ,సీనియర్ నాయకులు కేశవులు, బస సురేష్, తదితరులు పాలుగోన్నారు.
