Breaking News

క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులకు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం….

విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 9

క్రమశిక్షణ, విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఆలయమే పాఠశాల – మానస గణేశ్

అయ్యప్ప పౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ ఆధ్వర్యంలో..
తెలంగాణ కేసరి, ఆర్మూర్, జూలై 9: ఆర్మూర్ క్షత్రియ సమాజ్ లో ఇటీవల నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు ఘటడి ఆనంద్, డీకే రాజేష్ లకు మున్సిపల్ మాజీ చైర్మన్, అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ శాలువలతో ఘనంగా సన్మానించారు. పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో గురువారం సన్మానించారు. నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులను అయ్యప్ప శ్రీనివాస్ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ చేపూర్ గణేష్, సభ్యులు షేర్ ఒడ్డెన్న, చేపూర్ ధనుంజయ్, అలిశెట్టి నరేష్, వజ్ర వడ్డెన్న, గంగా సింగ్, సన్నీ, క్షత్రియ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *