
విజయభారతి : హైదరాబాద్ న్యూస్: రిపోర్టర్: సుంకరి; గంగా మోహన్.
హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఈ నెల 16 నుంచి ఆగస్టు 13 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది.జులై 16న గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో బోనాల సంబరాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం జులై 19న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, జులై 26న బల్కంపేట్ ఎల్లమ్మ దేవస్థానంలో కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.ఆగస్టు 2న లష్కర్ బోనాలు, ఆగస్టు 9న పాతబస్తీ బోనాలు ఘనంగా జరగనున్నాయి. ఆగస్టు 10న సంప్రదాయ ‘రంగం’ (భవిష్యవాణి) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చివరిగా ఆగస్టు 13న ఉత్సవాలు ముగియనున్నాయి.బోనాల సందర్భంగా నగరవ్యాప్తంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
