Breaking News

నవనాథ పురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సుంకరి గంగామోహన్ ను శాలువాతో ఘనంగా సన్మానం చేసిన బుస్సాపూర్ శంకర్….

విజయభారతి : ఆర్మూర్ న్యూస్

నూతన పదాధికారులకు సన్మానించిన బీజేపీ నేత , తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు , బిసి సాధికారత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సాపూర్ శంకర్నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ సుంకరి గంగామోహన్ ని మరియు కోశాధికారి తొగర్ల రాజేందర్ గారిని బీజేపీ నేత, తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు, బిసి సాధికారత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సాపూర్ శంకర్ మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ, జర్నలిజం రంగంలో సుంకరి గంగామోహన్ మరియు రాజేందర్ ఎన్నో సంవత్సరాలుగా నిష్పక్షపాతంగా, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఆయన ఎన్నిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.కొత్త బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, మీడియా ప్రజలకు మరియు సమాజానికి వారధిగా నిలిచి ప్రజాస్వామ్య బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.ఈ సందర్భంగా సుంకరి గంగామోహన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి, ఆయనకు శాలువా కప్పి సత్కరించారు.ఈ కార్యక్రమంలోబిసి సాధికారిక సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు చంద్రకాంత్ గౌడ్ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు నవీన్ , లిక్కి కుమార్ , రామ కృష్ణ , వినోద్ , కిషోర్ తదితరులు

ఎస్ ఐ ఆర్ విజయవంతానికి ప్రతి సామాజిక కార్యకర్త కృషి చేయాలి… ప్రతి ఓటరూ పేరు జాబితాలో ఉండేలా అధికారులు చొరవ చూపాలి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *