
విజయభారతి : ఆర్మూర్ న్యూస్ :12: రిపోర్టర్ సుంకరి: గంగ మోహన్:
ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కృషితో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుంచి వార్డు సభ్యురాలు విజయకు మంజూరైన ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా బీజేపీ మాజీ కౌన్సిలర్ సుంకరి రంగన్న మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నదని తెలిపారు. ఖరీదైన కార్పొరేట్ వైద్య చికిత్సల కోసం ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఈ నిధి ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.అలాగే ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కృషితో ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని, ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.
