Breaking News

ఆర్మూర్ లో సమాజ్ అధ్యక్ష కార్యదర్శులకు ఘనంగా సన్మానం… క్షత్రియ మహిళా మండలి ఆధ్వర్యంలో….

విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై: 12 రిపోర్టర్: సుంకరి గంగా మోహన్

ఎస్ ఐ ఆర్ విజయవంతానికి ప్రతి సామాజిక కార్యకర్త కృషి చేయాలి… ప్రతి ఓటరూ పేరు జాబితాలో ఉండేలా అధికారులు చొరవ చూపాలి….

ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు గటడి ఆనంద్, డీకే రాజేష్ లను క్షత్రియ మహిళా మండలి సభ్యులు ఖాందేశ్ సంగీత, గటడి స్వాతి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఆర్మూర్ లోని క్షత్రియ కళ్యాణ మండపంలో ఆదివారం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షత్రియులు తమపై విశ్వాసం ఉంచి ఎన్నికలలో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. సంగీత, స్వాతిలు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను అభినందించారు. క్షత్రియ కులస్తుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు డిజె సులోచన, బొచ్కర్ వీణ, సాత్ పుతే మంజుల, గుజరాతి లక్ష్మి, బొచ్కర్ ప్రమీల, దొండి సునీత, జెస్సు లలిత, డీజే లత, శాంతి, గుజరాతి గీత, బొచ్కర్ సునీత, ఘటడి జయశ్రీ, పోహార్ విద్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *