
పట్టు చేనేత సహకార సంఘం ఏకగ్రీవం
అధ్యక్షులుగా చక్రు, ఉపాధ్యక్షులుగా షికారి శ్రీనివాస్
ఆర్మూర్ జూలై 13 :-
ఆర్మూర్ పట్టణంలో ఇటీవల గెలుపొందిన పట్టు చేనేత సహకార సంఘం 9 మంది డైరెక్టర్లతో సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శి, సెక్రటరీ పోస్టులకు ఎన్నిక నిర్వహించామని ఎన్నికల అధికారి సాయికుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా బోచ్ కర్ కోలు గంగ మోహన్, ఉపాధ్యక్షులుగా శికారి శ్రీనివాస్, కార్యదర్శిగా బోచ్ కర్ లక్ష్మీనారాయణ, కోశాధికారిగా బదాం రాజ్ కుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి సాయి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బోచ్ కర్ కోలు గంగ మోహన్ చక్రు మాట్లాడుతూ పట్టు చేనేత సహకార సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, సంఘం సభ్యులకు ప్రభుత్వ పథకాలు, ఐడి కార్డులు కూడా అందేలా చూస్తానని తెలిపారు. గెలుపొందిన డైరెక్టర్లందరిని పూలమాల శాలువతో క్షత్రియ ఖత్రి సమాజ్ మాజీ కార్యదర్శి బారడ్ గంగా మోహన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పొహర్ శైలేష్, ఖాందేష్ సత్యం, బచ్చేవాళ్ రెడ్డి శ్రీనివాస్, పడాల్ నరేందర్, పడాల్ గణేష్, మాజీ అధ్యక్షులు పోహార్ మోహన్, కర్తన్ గణేష్యామ్, కౌన్సిలర్ పాన్ శ్రీనివాస్, బారడ్ కిషోర్, పొహార్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
