
విజయభారతి ఆర్మూర్, జూలై 13:
ఆర్మూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో హెడ్ కుక్, అడిషనల్ కుక్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా సోమవారం ఇంటర్వ్యూలు విజయవంతంగా నిర్వహించారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈవో సభ్యులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశారు. అనంతరం ఇంటర్వ్యూలకు సంబంధించిన నివేదికను జిల్లా స్థాయి అధికారులకు పంపించారు.
జిల్లా స్థాయి అధికారులు తుది ఎంపిక జాబితాను విడుదల చేసిన వెంటనే అర్హులైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేసి విధుల్లోకి తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
