మధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలు
దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
అమ్మవారికి ఒడిబియ్యం, బోనాలు సమర్పించిన మహిళలు
ఆకట్టుకున్న శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు
శేరిలింగపల్లి మియపూర్ విజయ భారతి న్యూస్ ; మధినాగుడా డివిజన్ పరిధిలోని మధినగుడా గ్రామంలో బోనాల పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం
ఆషాఢ మాసం, శ్రావణమాసాలను పురస్కరించుకొని మదినగుడా గ్రామాల్లో శ్రావణ మాసం మొదటి ఆదివారం రోజున శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ, మల్లన్న పోచమ్మ బోనాల పండుగను గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. డప్పు చపుళ్ళ నడుమ శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ప్రజల అందరిని అలరించాయి. భక్తులు అమ్మవారి మొక్కులను చెల్లించుకుని వడిబియ్యలు పోసి నైవేద్యాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఆదివారం రోజు ఉదయం నుంచే శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ, మల్లన్న, పోచమ్మ దేవాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. శివసత్తి భారతి మాట్లాడుతూ. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదినగుడా గ్రామ ప్రజలు, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

