(విజయభారతి )భీమ్గల్ న్యూస్: ఆగస్టు: 13
భీమ్గల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్మూర్ సబ్ కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో భూభారతి పోర్టల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్లను పరిశీలించి, వాటి ప్రస్తుత స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో అందేలా అధికారులు సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
