ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.
డొంకేశ్వర్ మండలంలోని తొండకూర్ ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ వరలక్ష్మి మాట్లాడుతూ, అజ్ఞానం మన చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును పంచేవారు గురువులు అని, యాఫ్, ఎల్, ఎన్ లో భాగంగా విద్యార్థులు కనీస సామర్థ్యాల సాధనకు ఒక గంట రెమెడియేషన్ పిరియడ్ తీసుకుంటామని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది గురువులే అని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా సాయికుమార్ ను శాలువాతో సత్కరించి సన్మానించారు. విద్యార్థులు స్వయంగా బొకేలు గ్రీటింగ్ కార్డులు తయారుచేసి హ్యాపీ టీచర్స్ డే అంటూ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థినీ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల బృందం గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

