సోదరభావాన్ని చాటిన విద్యార్థులు
మియాపూర్ – విజయభారతి
మియాపూర్ లోని మాతృశ్రీ డీఏవీ పబ్లిక్ స్కూల్ లో రక్షాబంధన్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ఒకరికొకరు రాఖీలు కట్టుకుని సందడి చేశారు.ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ఆనందవల్లి ముఖ్య అతిథిగా హాజరై రక్షాబంధన్ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానుబంధానికి, రక్షణకు ప్రతీక ఈ పండుగ అని, భారతీయ సంస్కృతిలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపారు. సోదరభావంతో, ఐక్యతతో మెలగాలని విద్యార్థులకు సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన రంగురంగుల రాఖీలను ప్రదర్శించారు. చిన్నారుల సృజనాత్మకత అందరినీ ఆకట్టుకుంది.కార్యక్రమంలో ఉపాధ్యాయులు హిమబిందుసాగర్, హిమబిందుతో పాటు ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

