హైదరాబాద్ విజయ భారతి న్యూస్ ; వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ పట్టుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ లో చోటుచేసుకుంది. ఓ వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేసిన నిందితులు. పక్క సమాచారంతో ఆ ఇంటి పై దాడులు జరిపిన చందానగర్ పోలీసులు. రాజస్థాన్ నుండి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు. ఘటన స్థలంలో 18 లక్షల విలువ చేసే 150 గ్రాముల MDMA డ్రగ్స్ ను సీజ్ చేసిన పోలీసులు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం.
