Breaking News

హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న ఐటి దాడులు

హైదరాబాద్ విజయ భారతి న్యూస్ ;
హైదరాబాద్ లో మరోసారి ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలో సోమవారం రోజు ఉదయం నుండి తనిఖీలు చేస్తున్నారు. ఆ సంస్థ నిర్వాహకులైన కల్పన రాజేంద్ర లక్ష్మణ్ నివాసాలతో పాటు షాద్‌ నగర్ చేవెళ్ల బంజారాహిల్స్ కార్యాలయాలతో సహా మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవలే స్వస్తిక్ గ్రూప్ షాద్‌నగర్ ప్రాంతంలో.. ఓ ఎంఎన్‌సీ కంపెనీకి రూ.300 కోట్ల విలువైన భూమిని అమ్మింది. అయితే, బ్యాలెన్స్ షీట్స్‌లో భూ విక్రయానికి సంబం ధించి లెక్కలు చూపలేదనే ఆరోపణ నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *