అనుమతులు నిల్ నిర్మాణాలు ఫుల్
చైన్మెన్ నుండి జోనల్ కమిషనర్ వరకు అందరిపై ఆరోపణలు
అయ్యప్ప సొసైటీలో క్రమ నిర్మాణాలను ఆపేదేవరు
అక్రమ నిర్మాణాదారులకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల సహాయ సహకారాలు
శేరిలింగంపల్లి మాదాపూర్ విజయభారతి న్యూస్ ; మాదాపూర్ డివిజన్ పరిధిలో గల అయ్యప్ప సొసైటీ లో అక్రమ నిర్మాణాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. అక్రమార్కులు ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం నిద్రమత్తులో మునిగిపోతున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు జరగకుండా చూసుకోవాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి అక్రమ నిర్మాణాలకు అజ్యం పోస్తున్నారు. అయ్యప్ప సొసైటీ లో ఎలాంటి అనుమతి లేకుండా భారీ అక్రమ నిర్మాణం జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చందానగర్ సర్కిల్ 21 పరిధిలో ఏ నిర్మాణం చేపట్టిన అనుమతులు తప్పనిసరి. కానీ అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా టౌన్ ప్లానింగ్ చైన్ మేన్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అండదండలతో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. దీంతో జిహెచ్ఎంసి ఆదాయానికి భారీగా గండి పడుతుంది. అయినప్పటికీ దాన్ని ఆచరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని మామూళ్లకు అలవాటుపడి వాటిని పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు చేస్తే అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. యదేఛ్చగా అక్రమ నిర్మాణాలు జరుపుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు చొరవ తీసుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మాదాపూర్ డివిజన్ ఐటీ కారిడార్లోని గురుకుల్ ఘట్కేసర్ ట్రస్టు వివాదాస్పద భూములలో చందా నాయక్ తండ, అయ్యప్ప సొసైటీ, సర్వేఆఫ్ ఇండియా, భాగ్యనగర్ సొసైటీలు ఉన్నాయి. ఈ నాలుగు సొసైటీల్లో సుమారు 300 నుండి 400 కు పైగానే బహుళ అంతస్తుల భవనాలను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించారు. మరికొన్నింటిలో పనులు కొన సాగుతున్నాయి. గతంలోనే కొన్ని నిర్మాణాలు పూర్తి అవగా ఇంకొన్ని మూడు, నాలుగు నెలల క్రితం పనులు మొదలుపెట్టినవే ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరి దగ్గరి బంధువులు, వారి అనుచరులు అన్నీ తామై ఈ అక్రమ నిర్మాణాల తతంగాన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వారికి జీహెచ్ఎంసీ అధికారులు పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు ఈ విషయంతో సంబంధం ఉందని, అందువల్లే అధికారులు పట్టించుకోవడం. లేదనే ప్రచారం జరుగుతోంది.
చందానగర్ సర్కిల్-21లో చైన్ మెన్, టౌన్ ప్లానింగ్ టిపిఎస్ ఉద్యోగుల హవా కొనసాగుతోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో వీళ్లే కింగ్ మేకర్లు. సర్కిల్-21 పరిధిలో ఎక్కడ ఏ బిల్డింగ్ కట్టినా..ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా..వీరికి అడిగినంత ఇచ్చుకోవాల్సిందే.కాదు, కుదరదు అంటే కొత్తగా ఒక ఇటుకను కూడా పేర్చనియ్యరు.తట్టేడు సిమెంట్ ను కూడా పోయ్యనివ్వరు. వాస్తవానికి జీహెచ్ఎంసీ పరిధిలో చందానగర్ సర్కిల్-21 నిర్మాణ రంగంలో వేగంగా దూసుకుపోతోంది. ఈ సర్కిల్ పరిధిలో చందానగర్, మియాపూర్, హఫిజ్ పేట్, మాదాపూర్ మొత్తం నాలుగు డివిజన్లున్నాయి. సుమారు 3 లక్షల వరకు జనాభా ఉంటుంది. ప్రతీ ఏటా కొన్ని వందల భవనాల నిర్మాణాలు జరుగుతుంటాయి. గురుకుల్ ట్రస్ట్ ల్యాండ్స్, సర్వే ఆఫ్ ఇండియా,గోకుల్ ప్లాట్స్ సోసైటీ వంటి భూములు కూడా చందానగర్ సర్కిల్ పరిధిలోనే ఉన్నాయి. ముఖ్యంగా అయ్యప్ప సొసైటీలో నిర్మిస్తున్న జగన్నాథ్ రెడ్డి, ప్రతాప్ వర్మ అనే ఓ బిల్డర్లు ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా భారీ భావనాలు నిర్మిస్తూ తమను అడిగేవారే లేరన్నట్టుగా రెచ్చిపోతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే లైట్ తీసుకుంటారు. అయ్యప్ప సొసైటీలో ప్రతాప్ వర్మ కి దాదాపు పదుల సంఖ్యలో భవనాలు ఉన్నాయి. ఒక్కదానికి కూడా ఎలాంటి కనీస అనుమతులు, ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా భారీ భవనాలు నిర్మిస్తున్న ఎవరు అడ్డుకోరు సరికదా దగ్గరుండి మరీ అధికారులే వాటిని పూర్తి స్థాయిలో వారి అధికారాన్ని అడ్డంపెట్టి సంరక్షిస్తుంటారని సొసైటీ లో టాక్. కేవలం ఒక ప్రతాప్ వర్మ, జగన్నాథ్ రెడ్డి నే కాకుండా ఇంకా చాలా మంది ఈ జాబితాలో ఉన్నారు. అయ్యప్ప సొసైటీలో నిర్మిస్తున్న ప్రతాప్ వర్మ లాంటి వారికి ఒక న్యాయం చిన్న చితక ఇళ్లు నిర్మించేవారకి మారో న్యాయమా అంటూ మొత్తం సొసైటీ లో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇలా మన ఘనత వహించిన జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై సర్వత్ర అయ్యప్ప సొసైటీ మొత్తంలో చర్చనీయాంశం అయ్యింది. సర్కిల్-21 పరిధిలోని భవన నిర్మాణాల విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. ప్రతీ సంవత్సరం వందల కొద్ది భారీ భవన నిర్మాణాలు జరుగుతున్నందున కోట్లల్లో సోమ్ము సర్కార్ ఖజనాకు జమ అయ్యే ఛాన్సుంది.కానీ, ఇక్కడ అలా జరగడం లేదు.సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. నిబంధనల ప్రకారం చందానగర్ సర్కిల్-21 పరిధిలోని టౌన్ ప్లానింగ్ వింగ్ కు నలుగురు టీపీఎస్ అధికారులుండాలి. అయితే వీరిలో ఇద్దరు అధికారులు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం బాధాకరం. ఉన్నతాధికారులు ఒక టీపీఎస్ అధికారిని మాదాపూర్ డివిజన్ కు కేటాయించినప్పటికీ ప్రస్తుతం అతను కొత్త కావడంతో చందానగర్ సర్కిల్ 21 లో ఆయన ఆడిందే ఆట..పాడిందే పాటన్న చందనంగా మారిపోయింది. చందానగర్ సర్కిల్ 21 పరిధిలో ప్రతీరోజు అనేక చోట్ల కొత్త భవనాలు, అదనపు బిల్డింగ్స్ నిర్మాణాలు, సెల్లార్ల కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి. అయితే ఎక్కడ కొత్త నిర్మాణాలు ప్రారంభమైనా అక్కడ ఈ ఉద్యోగులు గద్దల్లా వాలిపోవడం అలవాటుగా మారిపోయింది. భవన నిర్మాణ యాజమానులు వీరికి అడిగినంత ఇస్తే కానీ, అస్సలు ఊరుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. జీరో పర్మిషన్ కు ఎంత చెల్లించాలి, అదనపు ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ కు ఎంత ముట్టజెప్పాలి..కొత్త భవనాల నిర్మాణాలకు ఎంత చెల్లించాలి అనే విషయాలపై ఓ ధరను నిర్ణయించేస్తున్నారు. ఒకవేళ వీరు చెప్పినంత ఇవ్వకుంటే వెంటనే ఉన్నతాధికారులకు సదరు నిర్మాణ యాజమానుల వివరాలను చేరవేసి పనులను నిలిపివేయిస్తున్నారనే విమర్శలున్నాయి. ఫైర్ సెఫ్టీ, సెట్ బ్యాక్, ఇతరత్రా కారణాలు చెప్పి నిర్మాణాలు నిలుపుదల చేయిస్తున్నారు. ఈ విషయంలో టౌన్ ప్లానింగ్ ఉద్యోగులకు పై స్థాయి ఉన్నతాధికారుల నుంచి అండదండలు పుష్కలంగా అందుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఇచ్చిన సపోర్టుతోనే ఈ అవినీతి తిమింగలాలు రెచ్చిపోతున్నట్లు సమాచారం. రోజు వారిగా బిల్డింగ్ నిర్మాణ యాజమానుల దగ్గర వసూల్ చేసుకొచ్చిన అవినీతి సోమ్మును పై అధికారులకు వారి వారి స్థాయిలను బట్టి ఎవరి ముల్లే వారికి అప్పజెబుతున్నట్లు తెలుస్తోంది.

